శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ ఏర్పాట్ల పరిశీలన చేసిన MLA

0
0

ఈ నెల 20వ తేదీన మదనపల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో, చిత్తూరు బస్టాండ్ వద్ద ఏర్పాటు చేయనున్న ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సన్నాహాలు వేగంగా జరుగుతున్నాయి.

మదనపల్లె ఎమ్మెల్యే, మరాఠీ సంఘం సభ్యులు కలిసి విగ్రహ ప్రాంతాన్ని శనివారం పరిశీలించి, కార్యక్రమ విజయవంతానికి అవసరమైన ఏర్పాట్లపై అధికారులకు, నిర్వాహకులకు సూచనలు చేశారు. శివాజీ మహారాజ్ స్ఫూర్తి భావితరాలకు ఆదర్శమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.