ఆసిఫాబాద్‌లో కలకలం దంపతుల అనుమానాస్పద మృతి|

0
0

🎤కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్

ఆసిఫాబాద్, జూన్ 18 కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పరిధిలో ఒక ఘోర విషాద ఘటన చోటుచేసుకుంది. ఒకే ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరూ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. ఆసిఫాబాద్ మండల పరిధిలోని కోసార గ్రామానికి చెందిన బానోత్ రాజు, అతని భార్య సునీత తమ ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయారు. ఒకే కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరూ విగతజీవులుగా పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఈ ఘటనతో కోసార గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలముకున్నాయి.రంగంలోకి దిగిన పోలీసులు ఈ ఘటనపై స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఆసిఫాబాద్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను క్షుణ్ణంగా పరిశీలించి, ప్రాథమిక వివరాలను సేకరించారు.అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.పోలీసుల దర్యాప్తు దంపతుల మృతికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు.పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతికి గల కారణాలపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.