ఆసిఫాబాద్‌లో పైప్‌లైన్ సమస్య పరిష్కరించిన కౌన్సిలర్ కార్తీక్|

0
174

🎤ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్: ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రథమ కర్తవ్యమని ఆసిఫాబాద్ మున్సిపాలిటీ 11వ వార్డు కౌన్సిలర్ రాపర్తి కార్తీక్ మరోసారి నిరూపించారు. గత కొన్ని రోజులుగా 11వ వార్డు పరిధిలో ప్రధాన పైప్‌లైన్ లీకేజీ కారణంగా తాగునీరు వృథా కావడంతో పాటు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని గమనించిన కౌన్సిలర్ రాపర్తి కార్తీక్ తక్షణమే స్పందించి, మున్సిపల్ అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. అనంతరం మున్సిపల్ వాటర్ వర్క్స్ సిబ్బందితో కలిసి యుద్ధప్రాతిపదికన లీకేజీ మరమ్మతు పనులను స్వయంగా పర్యవేక్షించి, సమస్యకు తక్షణ పరిష్కారం చూపారు.ఈ కార్యక్రమంలో వార్డ్ ఆఫీసర్ సచిన్ పృధ్వీరాజ్ కూడా పాల్గొని సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ రాపర్తి కార్తీక్ మాట్లాడుతు. వార్డులో ఎక్కడైనా తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు లేదా ఇతర మౌలిక సదుపాయాలకు సంబంధించిన సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రధాన ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు. చాలా రోజులుగా వేధిస్తున్న పైప్‌లైన్ లీకేజీ సమస్యను త్వరితగతిన పరిష్కరించడంతో 11వ వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ, సకాలంలో స్పందించిన కౌన్సిలర్ రాపర్తి కార్తీక్‌తో పాటు మున్సిపల్ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.