సికింద్రాబాద్ మహంకాళి బోనాల జాతర ఘనంగా జరిగింది. ఈరోజు తెల్లవారు జామున నుంచే భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. శివసత్తుల ముత్యాలతో అమ్మవారి ప్రాంగణం సందడిగా మారింది. సీఎం రేవంత్, మంత్రులు, బిఆర్ఎస్ నేత కేటీఆర్ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు.










