ఈరోజు మార్కాపురంలో నిర్వహించిన కూటమి ప్రభుత్వం రెండేళ్ల నమ్మకం – సంక్షేమం, అభివృద్ధి విజయోత్సవ సభలో జిల్లా ఇంచార్జి మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఒంగోలు ఎంపీ శ్రీ మాగుంట శ్రీనివాసులురెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్యే శ్రీ కందుల నారాయణరెడ్డి గారు, కనిగిరి ఎమ్మెల్యే శ్రీ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు, గిద్దలూరు ఎమ్మెల్యే శ్రీ ముత్తుమూల అశోక్ రెడ్డి గారు, యర్రగొండపాలెం టిడిపి ఇంచార్జ్ ఎరిక్షన్ బాబు గారు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులతో కలిసి పాల్గొన్నాను. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన వివిధ శాఖల స్టాల్స్ను పరిశీలించాము. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిదే. ఉమ్మడి ప్రకాశం జిల్లా వరప్రదాయిని అయిన వెలిగొండ ప్రాజెక్టు సప్లై ఛానల్ను ప్రారంభించి, ప్రాజెక్టు పనులను శరవేగంగా పూర్తి చేస్తూ సాగునీటి కలను సాకారం చేస్తున్నాం. అలాగే మార్కాపురం జిల్లాను హార్టికల్చర్ హబ్గా అభివృద్ధి చేసి రైతుల ఆదాయాన్ని పెంచేందుకు, ప్రాంతీయ ప్రగతిని మరింత వేగవంతం చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నాను.










