ఖరీఫ్ పంటల బీమా నమోదు గడువును ఆగస్టు 15 వరకు పొడిగించినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు.
ఇంకా పంటల బీమా నమోదు చేసుకోని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆగస్టు 15లోపు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా బీజేపీ నాయకులు రైతులకు అవగాహన కల్పిస్తూ, గడువు ముగిసేలోపు పంటల బీమా నమోదు పూర్తి చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.










