శనివారం నిమ్మనపల్లి మండలంలోని గుండ్లబురుజు గ్రామంలో ఊర కుక్క దాడిలో కుందన్ (7) అనే బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. వీధిలో ఆడుకుంటున్న బాలుడిపై కుక్క దాడి చేసి ముఖంపై కరిచింది. కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించగా, వైద్యుల చికిత్సతో ప్రస్తుతం బాలుడు కోలుకుంటున్నాడు.










