కార్మికులకు ఏం చేశారని విజయోత్సవాలు?: సాంబశివ.|

0
0

మదనపల్లిలో శనివారం ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్–ఏఐటీయూసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ మాట్లాడుతూ, రెండేళ్ల పాలనలో ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి ఏం చేసిందని ప్రశ్నించారు. కార్మికుల వేతనాలు పెంచలేదని, వారిని పర్మినెంట్ చేయలేదని, ఇంటి స్థలాలు కూడా ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో విజయోత్సవ సభలు నిర్వహించడం సమంజసం కాదని ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు