మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు గత బీ ఆర్ఎస్ హయాంలో 900 కోట్ల అక్రమ ఆస్తులు కూడబెట్టారని దీనిపై విచారణ జరపాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జల కాంతం డిమాండ్ చేశారు. కరీంనగర్లో ఆయన మాట్లాడుతూ ఇసుక దందా, అక్రమాలతో మధు ఈ ఆస్తులు సంపాదించారని ఆరోపించారు.మంత్రి శ్రీధర్ బాబుని విమర్శించే నైతిక అర్హత మధుకు లేదని నోటిని అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.










