మదనపల్లెలో చిల్లర దొంగల హల్‌చల్.|

0
2

మదనపల్లె మండలంలోని సీటీఎం ప్రాంతంలో చిల్లర దొంగల బెడద పెరుగుతోంది. శనివారం అర్ధరాత్రి ఇద్దరు చిన్నారులతో వచ్చిన ఓ మహిళ నేతాజీనగర్, సోమలగడ్డలోని ఓ దుకాణం షట్టర్ తొలగించి లోపలికి ప్రవేశించి రూ. 22 వేల నగదు, సుమారు రూ. 30 వేల విలువైన సిగరెట్లు అపహరించినట్లు సమాచారం. ఆదివారం ఉదయం దుకాణ యజమాని శివారెడ్డి చోరీని గుర్తించి సీసీ కెమెరా ఫుటేజీతో తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్సై చంద్రమోహన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.