నిమ్మనపల్లె ఎస్సై రామకృష్ణ ఆదివారం యువకులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. యువత గాంజా, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, లేదంటే భవిష్యత్తు నాశనమవుతుందని హెచ్చరించారు. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై శ్రద్ధ వహించాలని సూచించారు. అనుమానితులకు డ్రగ్ టెస్టులు నిర్వహిస్తున్నామని, పాజిటివ్ వస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గాంజా విక్రయాలు, రవాణాపై సమాచారం పోలీసులకు ఇవ్వాలని కోరారు.










