అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మదనపల్లిలోని మిషన్ కాంపౌండ్ మైదానంలో ‘యోగాంధ్ర-2026’ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారు 1,600 మంది పాల్గొని యోగాసనాలు వేశారు. కలెక్టర్ నిశాంత్ కుమార్ యోగాను ప్రజా ఉద్యమంగా మార్చి, ప్రతి ఒక్కరూ నిత్యజీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఎస్పీ ధీరజ్ కునుబిల్లి యోగా ఒత్తిడిని జయించి మానసిక ప్రశాంతతను అందిస్తుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా యోగా, క్రీడలు, ఈతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు










