📍 వెంగళాపురం గ్రామం | 20-06-2026
🧹 స్వచ్ఛతతో ఆరోగ్యం – ఆత్మగౌరవంతో జీవనం: కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారు
స్వచ్ఛతను ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్యంతో పాటు ఆత్మగౌరవంతో జీవనం సాగించవచ్చని జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారు పేర్కొన్నారు.
కందుకూరు నియోజకవర్గం, లింగసముద్రం మండలం, వెంగళాపురం గ్రామంలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ గారు, ఎమ్మెల్యే శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న క్లీన్ స్వీప్ కార్యక్రమం స్వచ్ఛమైన గ్రామాలు, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి దోహదపడుతుందని తెలిపారు.
“శుభ్రతే ఆరోగ్యానికి మూలం – పరిశుభ్రమైన పరిసరాలే స్వర్ణాంధ్రకు పునాది” అని కలెక్టర్ గారు పేర్కొన్నారు.










