మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : చాదర్ఘాట్ విక్టోరియా ప్లేగ్రౌండ్లో ఇటీవల జరిగిన జూనియర్, సబ్జూనియర్ రాష్ట్ర స్థాయి పవర్లిఫ్టింగ్ పోటీల్లో 12 బంగారు, 2 వెండి పతకాలు సాధించిన కంటోన్మెంట్ క్రీడాకారులు బుధవారం ఎమ్మెల్యే శ్రీగణేష్ను కలిశారు.
ఈ సందర్భంగా విజేతలను, కోచ్లను అభినందించిన ఆయన మరింత కృషి చేసి జాతీయ, అంతర్జాతీయ వేదికలపై రాణించాలని ఆకాంక్షించారు. ప్రతిభావంతులైన యువ క్రీడాకారులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల అధికారి నందకిషోర్ గోకుల్, కోచ్ హేమలత తదితరులు పాల్గొన్నారు.










