యూపీఎస్ స్కూల్‌లో యాంటీ డ్రగ్స్ కార్యక్రమం.|

0
0

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : విద్యార్థుల్లో మాదకద్రవ్యాల వినియోగంపై అవగాహన పెంపొందించేందుకు  అల్వాల్ పీఎస్ పరిధిలోని  వెంకటాపురం యూపీఎస్ ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా విద్యార్థులకు డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిణామాలు, ఆరోగ్యంపై వాటి ప్రభావం, భవిష్యత్‌పై పడే ప్రతికూల ప్రభావాల గురించి వివరించారు.

మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి మంచి అలవాట్లు అలవరచుకోవాలని సూచించారు.

కార్యక్రమంలో ఎస్ఐ లక్ష్మణ్ రాజ్, ఎస్ఐ రాఘవేందర్ రెడ్డి పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

#Sidhumaroju

Alwal