పేదల కష్టాల్లో ప్రభుత్వం అండగా… సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
దర్శి టిడిపి కార్యాలయంలో బుధవారం 90 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా మంజూరైన రూ.46,98,403 విలువైన చెక్కులను దర్శి టిడిపి ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ గారు అందజేశారు.
ఈ కార్యక్రమంలో దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, తాళ్లూరు ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, టిడిపి, జనసేన నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు కూటమి శ్రేణులు పాల్గొన్నారు.










