ఆర్యవైశ్య సంఘానికి నూతన సారథ్యం.. కార్యవర్గం ప్రమాణ స్వీకారం.|

0
9

● రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ శుభాకాంక్షలు

● నూతన కార్యవర్గానికి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కైలాస్ రామ్ చందర్ గుప్తా దిశానిర్దేశం

● విద్య, వైద్యం సహా సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచన

మేడ్చల్-మల్కాజిగిరి, ఆగస్టు 8: శనివారం వీబీఆర్ గార్డెన్‌లో, ఆల్వాల్ ఆర్యవైశ్య సంఘం నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది.

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కైలాస్ రామ్ చందర్ గుప్తా తదితరులు కార్యక్రమానికి హాజరై నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా అమరవాది లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. నూతన కార్యవర్గం సంఘ ఐక్యతను కాపాడుకుంటూ ఆర్యవైశ్య సమాజ అభ్యున్నతికి కృషి చేయాలని ఆకాంక్షించారు. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలను మరింత విస్తరించాలని సూచించారు.

అనంతరం కైలాస్ రామ్ చందర్ గుప్తా మాట్లాడుతూ.. సంఘం బలోపేతానికి సభ్యుల మధ్య ఐక్యత, సమన్వయం ఎంతో అవసరమన్నారు. స్థానికంగా ఉన్న ఆర్యవైశ్యులకు నూతన కార్యవర్గం ఎల్లప్పుడూ అండగా నిలవాలని దిశానిర్దేశం చేశారు. సంఘ కార్యకలాపాలు కేవలం పరిపాలనకే పరిమితం కాకుండా సమాజ సేవకు విస్తరించాలని పిలుపునిచ్చారు. పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు విద్యా సహాయం, అవసరమైన వారికి వైద్య సహకారం అందించేలా సంక్షేమ కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. సమాజంలోని అవసరమైన వర్గాలకు అండగా నిలిచే విధంగా నూతన కార్యవర్గం పనిచేయాలని ఆకాంక్షించారు.

అనంతరం నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. సంఘ సభ్యులు, అతిథులను శాలువాలతో సత్కరించి, మెమొంటోలను బహుకరించారు.

అధ్యక్షుడిగా అమర శ్రీనివాస్ గుప్తా, ప్రధాన కార్యదర్శిగా గోలి వేణుగోపాల్ గుప్తా, ఆర్గనైజింగ్ సెక్రటరీగా గుమ్మడవెల్లి శ్రీనివాసులు గుప్తా, కోశాధికారిగా తోడుపునూరి రవి గుప్తా బాధ్యతలు స్వీకరించారు.

కార్యక్రమంలో జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు బెల్లే రమేష్ గుప్తాతో పాటు స్థానిక మాజీ కార్పొరేటర్లు, ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు, నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.

#sidhumaroju

Alwal