పుంగనూరు నియోజకవర్గం:రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి|

0
0

పుంగనూరు నియోజకవర్గం, సదుం మండల సరిహద్దులో ఉన్న రేగల్లుకు చెందిన ముగ్గురు గురువారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు రేగల్లుకు చెందిన కొందరు ఆటోలో పీర్ల పండగకు కలికిరి మండలంలోని దూదేకులపల్లికి వెళ్లారు. పండగ చూసుకొని తిరుగు ప్రయాణంలో వస్తుండగా టానా వడ్డిపల్లి వద్ద కారు, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ ముబారక్, మెహరున్ బి, ఆమె మనవడు వాహిద్ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి .