రాంనగర్ బ్రిడ్జి పనులను పరిశీలించిన మేయర్ మధుకర్|

0
2

రాంనగర్–అల్లూరి సీతారామరాజు నగర్ బ్రిడ్జి పనులను పరిశీలించిన మేయర్ దర్ని మధుకర్

మంచిర్యాల: జూన్ 26

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 32వ డివిజన్ రాంనగర్–అల్లూరి సీతారామరాజు నగర్ ప్రాంతాలను కలుపుతూ నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను మేయర్ దర్ని మధుకర్ స్థానిక ప్రజలతో కలిసి పరిశీలించారు.

 

ఈ సందర్భంగా నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు ఆయన సూచించారు. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే రెండు ప్రాంతాల ప్రజలకు రాకపోకలు మరింత సౌకర్యవంతంగా మారనున్నాయని తెలిపారు. 32వ డివిజన్ ప్రజల దశాబ్దాల కలను సాకారం చేసేందుకు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ప్రత్యేక చొరవతో నిధులు మంజూరు చేశారని పేర్కొన్నారు.

 

ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.