పోలియో రహిత సమాజమే మన లక్ష్యం..
ఈరోజు తర్లుపాడు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో, జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎమ్. విజయ సునీత గారితో కలిసి అత్యంత ప్రతిష్టాత్మకమైన “పల్స్ పోలియో డ్రైవ్” కార్యక్రమాన్ని ప్రారంభించి, చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం జరిగింది.
మన కూటమి ప్రభుత్వం చిన్న పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. చిన్నారులను పోలియో మహమ్మారి బారిన పడకుండా రక్షించడానికి ఈ ముందు జాగ్రత్త చర్య ఎంతగానో ఉపకరిస్తుంది. మార్కాపురం జిల్లావ్యాప్తంగా ఈరోజు సుమారు 1,05,000 మంది చిన్నారులకు పోలియో చుక్కల మందు వేయడమే లక్ష్యంగా యంత్రాంగం పనిచేస్తోంది.
ఐదేళ్ల లోపు వయసున్న ప్రతి చిన్నారికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి, వారి భవిష్యత్తుకు ఆరోగ్య రక్షణ కల్పించాల్సిందిగా తల్లిదండ్రులందరినీ కోరుతున్నాను. మన కూటమి శ్రేణులు, నాయకులు మరియు కార్యకర్తలు స్థానికంగా ఉంటూ ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నాను.









