ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డిని కామారెడ్డికి తరలించిన పోలీసులు|

0
0

ఆర్మూర్ ఎమ్మెల్యేను అడ్డుకున్న పోలీసులు

కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి తరలింపు

బిక్కనూర్ మండల కేంద్రం శివారులో 44వ జాతీయ రహదారిపై టోల్ ప్లాజా వద్ద సోమవారం ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ని పోలీసులు ఆర్మూర్ వెళ్లకుండా అడ్డుకున్నారు.ఆర్మూర్ పట్టణంలో చేపడుతున్న హిందూ ర్యాలీ కి మద్దతుగా ఎమ్మెల్యే రాకేష్ హైదరాబాదు నుండి వస్తుంటే మార్గమధ్యంలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పోలీసుల వైఖరిని నిరసిస్తూ గంటన్నర సేపు టోల్ ప్లాజా వద్ద తన కారులోనే నిరసన తెలిపారు. సీఐ నరేష్ విషయాన్ని జిల్లా ఎస్పీకి వివరించగా శాంతిభద్రతల సమస్యల కారణంగా ఎమ్మెల్యేను కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంపుకు తరలించాలని సూచించడంతో, ప్రత్యేక ఎస్కార్ట్ తో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిని కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి తరలించారు. దీంతో బిజెపి నేతలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి భారీగా తరలివచ్చారు.