ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (APUWJ) చింతూరు డివిజన్ నూతన కమిటీ ఎన్నిక ఏకగ్రీవంగా ముగిసింది. నిమ్మలగూడెంలోని జేకేసిటీ ఫంక్షన్ హాల్లో జరిగిన కీలక సమావేశంలో ఈ నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. డివిజన్ అధ్యక్షుడు, సౌకత్అలీ ప్రధాన కార్యదర్శి: నీలపు రాజేష్ రెడ్డి ఎన్నికైన అనంతరం నూతన అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా వర్కింగ్ జర్నలిస్టుల కోసం, ప్రత్యేకంగా హెల్త్ కార్డులు అందజేయడం, అత్యవసర సమయాల్లో ఆదుకునేందుకు ఒక సంక్షేమ నిధిని (Welfare Fund) ఏర్పాటు చేయడం తమ ప్రధాన లక్ష్యాలని వారు స్పష్టం చేశారు.
# Yadagiri










