“వాసవీనగర్ తదితర కాలనీల్లో ఫారాల పంపిణీని పర్యవేక్షించిన శాంతి శ్రీనివాస్ రెడ్డి.”
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా: ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా వాసవీనగర్, ప్రశాంత్నగర్, సాకలి బస్తీ, రాంనగర్ ప్రాంతాల్లో ఫారాల పంపిణీ కార్యక్రమాన్ని మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా నందికంటి శ్రీధర్, యాదగిరితో పాటు బీఎల్ఏలు పాల్గొని ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు ఫారాలు పంపిణీ చేశారు.
ప్రతి అర్హత కలిగిన ఓటరు తమ వివరాలను సక్రమంగా నమోదు చేసుకుని, అవసరమైన పత్రాలను సమర్పించి ఓటరు జాబితాలో పేరు కొనసాగించేలా సహకరించాలని వారు కోరారు.
ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, ప్రజలు ఎలాంటి సందేహాలు ఉన్నా బీఎల్ఏలను సంప్రదించి వాటిని నివృత్తి చేసుకోవాలని సూచించారు.
కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తున్నారని ఆమె తెలిపారు.
#Sidhumaroji
Alwal










