కరీంనగర్లో ముమ్మరంగా వాహన తనిఖీలు|

0
0

కరీంనగర్‌లో ముమ్మరంగా వాహన తనిఖీలు

కరీంనగర్: టౌన్ ఏసీపీ ఎన్. వెంకటస్వామి ఆధ్వర్యంలో త్రీటౌన్ సీఐ తిరుమలగౌడ్, పోలీసు సిబ్బందితో కలిసి నగరంలోని సివిల్ హాస్పిటల్ చౌరస్తా వద్ద ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. కరీంనగర్ నగరంలోకి వచ్చే అన్ని వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం లోపలికి అనుమతిస్తున్నారు. నంబర్ ప్లేట్లు సక్రమంగా లేని వాహనాలతో పాటు కార్లు, ఇతర వాహనాలను కూడా తనిఖీ చేస్తూ నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై చర్యలు తీసుకుంటున్నారు. నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలీసులు పకడ్బందీగా తనిఖీలు కొనసాగిస్తున్నారు.