అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్, మంగళవారం మాట్లాడుతూ, అన్నమయ్య పోలీస్ శాఖలో సుదీర్ఘ సేవలు అందించి పదవీ విరమణ పొందిన అధికారులు నేటి తరానికి ఆదర్శనీయులని అన్నారు. జూన్ నెలాఖరుతో రిటైరైన ఏఎస్ఐలు బాషా, మోసెస్, హెడ్ కానిస్టేబుల్ మదన మోహన్ రెడ్డిలను జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన ఘనంగా సన్మానించారు. బాధితులకు ప్రయోజనాలు త్వరగా అందేలా చూస్తామని, ఏ సమస్య వచ్చినా నేరుగా తనను సంప్రదించవచ్చని ఎస్పీ భరోసా ఇచ్చారు.









