“మీ వద్దకు – మీ గళ్ళా మాధవి” కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు 49వ డివిజన్లోని 117వ బూత్ పరిధిలో కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గళ్ళా మాధవి నిర్వహించారు. బూత్ పరిధిలోని ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలను తెలుసుకోవడం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై సమీక్షించడం, పార్టీని మరింత బలోపేతం చేయడం లక్ష్యమని ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు . ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి మరియు ఉపాధ్యక్షులు, క్లస్టర్, బూత్ కన్వీనర్,కో కన్వీనర్, యూనిట్, కో యూనిట్ మరియు పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.










