ఈదర గ్రామంలో టీడీపీ కార్యకర్త గోవిందరెడ్డి నివాస సందర్శన|

0
2

ముండ్లమూరు మండలం, ఈదర గ్రామానికి చెందిన టిడిపి కార్యకర్త భూమా గోవిందరెడ్డి గారి ఆహ్వానం మేరకు వారి నివాసానికి వెళ్లిన దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు, డాక్టర్ కడియాల లలిత్ సాగర్ గార్లు ఆత్మీయంగా అల్పాహారం చేయడం జరిగింది.

ఈ సందర్భంగా స్థానిక నాయకులు, కార్యకర్తలతో పలు విషయాలపై ముచ్చటించి, పార్టీ బలోపేతానికి కార్యకర్తల కృషి ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కూరపాటి శ్రీనివాసరావు, జనసేన మండల అధ్యక్షులు తోట రామారావు, ఈదర గ్రామ టిడిపి నాయకులు, మండలంలోని వివిధ హోదాల్లో ఉన్న పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.