“మోండా డివిజన్లో మూడు ప్రాంతాల్లో అభివృద్ధి పనుల ప్రారంభం”
మేడ్చల్ మల్కాజిగిరి: కంటోన్మెంట్ నియోజకవర్గంలో వర్షాకాలంలో నీటి నిల్వ సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించే లక్ష్యంతో మోండా డివిజన్లో రూ.31.10 లక్షల వ్యయంతో వర్షపు నీటి పైప్లైన్ నిర్మాణ పనులకు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ శుక్రవారం భూమిపూజ చేసి శ్రీకారం చుట్టారు.
ఈ పనుల్లో భాగంగా అల్లాడి పెంటయ్య నగర్లో రూ.9.50 లక్షలతో 200 మీటర్లు, డొక్కాలమ్మ టెంపుల్ ప్రాంతంలో రూ.9.10 లక్షలతో 200 మీటర్లు, కుమ్మరిగూడలో రూ.12.50 లక్షలతో 250 మీటర్ల మేర మొత్తం 650 మీటర్ల పొడవున రెయిన్వాటర్ పైప్లైన్ నిర్మాణ పనులు చేపట్టనున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీగణేష్ మాట్లాడుతూ, వర్షాల సమయంలో ఈ ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
సమస్యను గుర్తించి వెంటనే నిధులు మంజూరు చేయించినట్లు పేర్కొన్నారు. పనులను నిర్దేశిత గడువులోగా, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్ను ఆదేశించారు.
కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ, దశలవారీగా ప్రజా సమస్యలకు పరిష్కారం చూపించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
#Sidhumaroju










