ప్రజావాణిలో జిల్లా కలెక్టర్కి సీఐటీయు ఆధ్వర్యంలో వినతి |

0
1

మంచిర్యాల జిల్లా : తెలంగాణ మధ్యాహ్న భోజన కార్మిక సంఘం (సిఐటియు) ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణను స్వచ్చంద సంస్థలకు ఇవ్వద్దంటూ మధ్యాహ్న భోజన కార్మిక సంఘం సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి ప్రజావాణిలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది.

ఈ సందర్భంగా *దుంపల రంజిత్ కుమార్ సిఐటియు జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు గత 20 ఏళ్లుగా నాణ్యమైన భోజనం వంట చేసి పెడుతున్న నిర్వాహకుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు. కానీ నేడు ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం నిర్వహణను స్వచ్ఛంద సంస్థలకు అప్పజెప్పలని చూస్తుందని ఇది సరైనది కాదన్నారు.

ఇన్ని సంవత్సరాలు పని చేసిన కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందన్నారు.మధ్యాహ్న భోజన పథకం నిర్వహణను స్వచ్ఛంద సంస్థలకు అప్పచెప్పదంటూ జులై 18వ తేది నుండి జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలుకు మధ్యాహ్నం భోజన కార్మిక సంఘం జిల్లా కమిటీ (సీఐటీయూ) పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎండి రఫియా మధ్యాహ్నం భోజనం కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి, సరిత, మధునమ్మ, సబితా ఎండి రబియా జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.