ప్రతి పేదింటికి సౌర వెలుగు: కరెంట్ భారం నుంచి ఉపశమనం|

0
0

పేదింటికి సౌర వెలుగు… ప్రతి కుటుంబానికి కరెంట్ భారం నుంచి ఉపశమనం!

దర్శి మండలం రామచంద్రాపురం గ్రామంలోని ఎస్సీ కాలనీలో పీఎం సూర్యఘర్ పథకం కింద లబ్ధిదారుల ఇళ్లపై ఏర్పాటు చేసిన సోలార్ ప్యానళ్లను దర్శి టీడీపీ ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ , డా కడియాల లలిత్ సాగర్ గార్లు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అమలవుతున్న ఈ పథకం ద్వారా పేద కుటుంబాలకు ఉచిత సౌర విద్యుత్ అందించి, కరెంట్ బిల్లుల భారం తగ్గించడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

అలాగే రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌లో పీఎం సూర్యఘర్ పథకం సమర్థవంతంగా అమలవడం అభినందనీయమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో దర్శి ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి-సుబ్బారావు, దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, టీడీపీ మండల అధ్యక్షులు మారెళ్ళ వెంకటేశ్వర్లు, మోడీ ఆంజనేయులు, జిల్లా కార్యవర్గ సభ్యులు వల్లెపు నారాయణ, ఎలుగొండారెడ్డి, టీడీపీ నాయకులు గొర్రె సుబ్బారెడ్డి, సానే సుబ్బయ్య, రామచంద్రాపురం గ్రామ నాయకులు మరియు కూటమి శ్రేణులు పాల్గొన్నారు.