సోమల మండలంలోని జూనియర్ కళాశాలలో, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఆదేశాల మేరకు, డెంగ్యూ, టీబీ వ్యాధులపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ, పి. హెచ్. సి. వైద్యులు డాక్టర్ రాజకుమార్, ప్రిన్సిపాల్ నరేంద్ర కుమార్, ఎన్. ఎస్. ఎస్. కోర్డినేటర్ గౌతమ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, వ్యాధుల నివారణకు ర్యాలీ, ప్రతిజ్ఞ, కరపత్రాల పంపిణీ చేపట్టారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ లో భాగంగా ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహించి, పొగత్రాగేవారు, మద్యం సేవించేవారు, గతంలో టీబీ వచ్చినవారు, హెచ్ఐవీ పాజిటివ్, తక్కువ బీఎంఐ ఉన్నవారు, గర్భిణులు, షుగర్, దీర్ఘకాలిక జబ్బులు ఉన్నవారిని గుర్తించి, పౌష్టికాహారం ప్రాముఖ్యతను వివరించారు. దోమ కాటు ద్వారా వ్యాప్తి చెందే డెంగ్యూపై, ఫ్రైడే డ్రై డేపై అవగాహన కల్పించారు# కొత్తూరు మురళి.










