ప్రభుత్వ సర్వీసులో ఉన్న ప్రతి ఉద్యోగి చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారు సూచించారు.
సోమవారం గ్రీవెన్స్ హాలులో కారుణ్య కోటాలో ఉద్యోగాలు పొందిన ఏడుగురికి నియామక పత్రాలను అందజేసిన కలెక్టర్ గారు, విధుల పట్ల నిబద్ధతతో పనిచేయడంతో పాటు సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీమతి కల్పనాకుమారి గారు, డీఆర్ఓ శ్రీ పి. వెంకటరమణ గారు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.









