చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని కోనేటిపాళ్యం వద్ద జై శ్రీరామ్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన ఆటో స్టాండ్ను రిటైర్డ్ డీఎస్పీ సుకుమార్ బాబు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు రోడ్డు భద్రతా నిబంధనలను పాటించాలని, మద్యం సేవించి, సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపకూడదని సూచించారు. జైశ్రీరామ్ ఆటో యూనియన్కు తన సహాయసహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వెంకటరమణ రెడ్డి, N. R. అశోక్, మున్నా, ఆటో యూనియన్ సభ్యులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.










