ప్రజలతో ప్రత్యక్ష సంభాషణ… అభివృద్ధికి వేగవంతమైన కార్యాచరణ
టంగుటూరు మండలం పొందూరు గ్రామంలో నిర్వహించిన పల్లె నిద్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గ్రామస్తులతో ముఖాముఖి సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు.
గ్రామస్థులు ప్రస్తావించిన పొగాకు రైతుల సమస్యలు, తాగునీరు, డ్రైనేజీ, అంగన్వాడీ భవనం, పాఠశాల ప్రహరీ గోడ, చెరువుల అనుసంధానం, గ్రామ మౌలిక వసతులు తదితర అంశాలను విన్న కలెక్టర్, సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ప్రజల సమస్యలను గ్రామస్థాయిలోనే గుర్తించి, వేగంగా పరిష్కరించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. పల్లె నిద్ర కార్యక్రమం ద్వారా ప్రజల వద్దకే పరిపాలనను తీసుకెళ్లి ప్రతి సమస్యకు కార్యాచరణ రూపొందిస్తున్నాం” అని జిల్లా కలెక్టర్ తెలిపారు.
గ్రామాల సమగ్ర అభివృద్ధి, రైతు సంక్షేమం, మౌలిక సదుపాయాల మెరుగుదల, ప్రజలకు నాణ్యమైన సేవలందించడంలో రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు.
ప్రజల విశ్వాసమే ప్రభుత్వ బలం… గ్రామాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం.










