ఎస్పీ వకుల్ జిందాల్‌ను కలిసిన అమరావతి ఓఎస్డీ మనోజ్ హెగ్డే|

0
0

అమరావతి లా అండ్ ఆర్డర్ ఓఎస్డీగా నియమితులైన శ్రీ మనోజ్ రామనాథ్ హెగ్డే, ఐపీఎస్ గారు గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్, ఐపీఎస్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు

నిన్న అమరావతి లా అండ్ ఆర్డర్ ఓఎస్డీగా నియమితులైన శ్రీ మనోజ్ రామనాథ్ హెగ్డే, ఐపీఎస్ గారు, ఈ రోజు గుంటూరు జిల్లా పోలీసు క్యాంపు కార్యాలయంలో గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్, ఐపీఎస్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.

2022 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి శ్రీ మనోజ్ రామనాథ్ హెగ్డే గారు రాజంపేట నుంచి బదిలీపై అమరావతి లా అండ్ ఆర్డర్ ఓఎస్డీగా నియమితులై, నిన్న బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎస్పీ గారిని కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్, ఐపీఎస్ గారు శ్రీ మనోజ్ రామనాథ్ హెగ్డే గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అమరావతి రాజధాని ప్రాంతం అత్యంత ప్రాధాన్యత కలిగిన సున్నిత ప్రాంతం కావడంతో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటూ శాంతిభద్రతల పరిరక్షణలో సమర్థవంతంగా విధులు నిర్వహించాలని సూచించారు.

అలాగే తుళ్లూరు–సీఆర్డీఏ ప్రాంతంలో లా అండ్ ఆర్డర్ నిర్వహణలో ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ సమాచారాన్ని సమర్థవంతంగా వినియోగించుకుంటూ ప్రజలకు మెరుగైన భద్రత కల్పించేలా కృషి చేసి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.