–రాజీవ్ వీకర్ సెక్షన్లో మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి పరిశీలన.
–కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచన.
మేడ్చల్ మల్కాజిగిరి : మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి రాజీవ్ వీకర్ సెక్షన్లో ఇంటింటి పర్యటన నిర్వహించి ఎన్యుమరేషన్ ఫారాల సమర్పణ ప్రక్రియను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో హనుమంత్, రేణుక, అఫ్జల్, లడ్డు, రెహ్మత్, ఆరిఫ్, అశోక్, అరుణ్, సాజిద్, యాదగిరి, జార్జ్ పాల్గొన్నారు.
స్థానికులను కలిసి ప్రతి అర్హ కుటుంబం ఎన్యుమరేషన్ ఫారాన్ని సమర్పించిందా లేదా అనే విషయాన్ని ఆమె తెలుసుకున్నారు. ఇంకా నమోదు పూర్తి చేయని వారు వీలైనంత త్వరగా ప్రక్రియను పూర్తిచేసుకోవాలని సూచించారు.
కొత్తగా ఓటు హక్కుకు అర్హులైన వారి వివరాలను సేకరిస్తూ, ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అవగాహన కల్పించారు.
ఖచ్చితమైన ఎన్యుమరేషన్, సమగ్ర ఓటరు నమోదు ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు మరింత సమర్థవంతంగా సాగడంతో పాటు ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని శాంతి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.
#Sidhumaroju
Alwal










