ఆసిఫాబాద్‌లో పారిశుధ్య పనులను పరిశీలించిన చైర్‌పర్సన్|

0
1

ఆసిఫాబాద్ పట్టణంలోని దస్నాపూర్ వార్డులో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పారిశుధ్య పనులను ముమ్మరంగా నిర్వహించారు. ఈ పనులను మున్సిపల్ చైర్‌పర్సన్ ఆకాష్, వైస్ చైర్‌పర్సన్ ఎండి అహ్మద్ గారు స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు. వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా డ్రైనేజీలలో చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలని, దోమల నివారణకు బ్లీచింగ్ పౌడర్ చల్లడంతో పాటు ఫాగింగ్ పనులను వేగవంతం చేయాలని సిబ్బందిని ఆదేశించారు. పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యమని, ప్రజలు ఇళ్లలోని చెత్తను రోడ్లపై వేయకుండా మున్సిపల్ వాహనాలకే అందించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు.