పుంగునూరు: బోయకొండ గంగమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తజనం|

0
2

చిత్తూరు జిల్లా పుంగనూరులోని ప్రముఖ పుణ్యక్షేత్రం బోయకొండ గంగమ్మ దేవస్థానం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రధాన అర్చకులు అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కార్యనిర్వాహణాధికారి, ఉపకమీషనర్ ఏకాంబరం ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఉచిత ప్రసాదాల పంపిణీలో తోపులాటలు లేకుండా అందరికీ అందేలా సిబ్బందికి సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ రామనాథం, సుధాకర్ రెడ్డి, మణి తదితరులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.