పుంగనూరు: స్మశాన వాటిక దారి కోసం తహసీల్దార్‌కు వినతి|

0
2

అన్నమయ్య జిల్లా, సోమల మండలం, కందూరు గ్రామానికి చెందిన బ్రాహ్మణ, ఆర్యవైశ్య సంఘ సభ్యులు సోమవారం తాసిల్దార్ కు వినతిపత్రం అందజేశారు. పూర్వీకుల కాలం నుండి గ్రామ ఏరుకు ఆనుకొని ఉన్న ప్రభుత్వ పరంబోకు భూమిలో దహన సంస్కారాలు నిర్వహిస్తున్నామని, అయితే ప్రస్తుతం స్మశానానికి వెళ్లే దారిని కొందరు ఆక్రమించుకోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. స్మశాన స్థలానికి సరైన హద్దులు లేకపోవడం కూడా సమస్యలకు కారణమని పేర్కొన్నారు. స్మశాన వాటికకు దారి, సదుపాయాలు కల్పించాలని కోరారు# కొత్తూరు మురళి.