దేశ సమగ్రత, శాంతి భద్రతల పరిరక్షణలో మహోన్నతమైన సేవలు అందిస్తూ, ధైర్యం, క్రమశిక్షణ, త్యాగానికి ప్రతీకగా నిలుస్తున్న సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) వీర జవాన్లందరికీ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు శుభాభినందనలు తెలిపారు.
✅ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, వామపక్ష తీవ్రవాదాన్ని అణచివేయడం, శాంతిభద్రతలను పరిరక్షించడం, దేశ అంతర్గత భద్రతను కాపాడడంలో CRPF ఎల్లప్పుడూ ముందంజలో నిలిచిందని అన్నారు.
✅ దేశ ప్రజల భద్రత కోసం సేవ దృక్పథం, విధేయతతో నిరంతరం విధులు నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్ దళాల సేవలు ప్రతి పౌరుడికి గర్వకారణమని, వారి అంకితభావం, దేశభక్తి, నిస్వార్థ సేవా తత్వం యువతకు స్ఫూర్తిదాయకమని ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు.










