Madanapalle: మదనపల్లె విజయభారతి హైస్కూల్‌లో ఎమ్మెల్యే షాజహాన్ బాషా గురు పౌర్ణమి వేడుకల్లో పాల్గొని, పాఠశాల ఎన్నికల విజేతలకు నియామక పత్రాలు అందజేశారు.

0
4

మదనపల్లె: మదనపల్లె సొసైటీ కాలనీలోని విజయభారతి ఇంగ్లీషు మీడియం హైస్కూల్‌లో బుధవారం గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపల్ నిశ్చిత సేతు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మదనపల్లె ఎమ్మెల్యే ఎం. షాజహాన్ బాషా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

 

ఈ సందర్భంగా పాఠశాల ఎన్నికల్లో విజయం సాధించిన విద్యార్థులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు.కార్యక్రమంలో మాట్లాడిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా, విద్యార్థులు జీవితంలో తల్లిదండ్రులు, గురువులను ఎల్లప్పుడూ గౌరవించాలని సూచించారు.

 

సంపద కంటే మానవత్వం, సేవాభావం గొప్పవని, సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. పాఠశాల చైర్మన్ డాక్టర్ ఎన్. సేతు విలువలతో కూడిన విద్యను అందిస్తూ విద్యార్థుల్లో సంస్కృతి, సంప్రదాయాలను పెంపొందిస్తున్న తీరు అభినందనీయమని పేర్కొన్నారు. ప్రిన్సిపల్ నిశ్చిత సేతు మాట్లాడుతూ, మనిషి జీవితంలో గురువుల పాత్ర ఎంతో కీలకమని, తల్లిదండ్రుల నుంచి విద్యా ప్రస్థానం వరకు ప్రతి దశలో గురువుల మార్గదర్శకత్వం అవసరమని చెప్పారు.