చంద్రబాబు ఇంట్లో వినాయక పూజలు.. రాష్ట్రాభివృద్ధికి ప్రార్థనలు |

0
3

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా, రాష్ట్రాభివృద్ధికి ఎదురయ్యే విఘ్నాలన్నీ తొలగిపోయి, ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉండాలని ఆ విఘ్నేశ్వరుడిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు.

 కుటుంబ సభ్యులతో కలిసి గణనాథుడికి భక్తిశ్రద్ధలతో పూజలు చేయడం గొప్ప ఆధ్యాత్మిక అనుభూతినిచ్చిందని చంద్రబాబు పేర్కొన్నారు. జ్ఞానానికి, వివేకానికి, విజయానికి గణపతి ప్రతీక అని, ఏ శుభకార్యాన్నైనా వినాయక పూజతో ప్రారంభించడం మన సాంప్రదాయమని ఆయన గుర్తుచేశారు.

 విఘ్నాలను తొలగించి సన్మార్గం చూపే చవితి వేడుకలు సామాజిక స్పృహను, ఐక్యతను నేర్పిస్తాయని సీఎం అన్నారు. సమాజాన్ని సన్మార్గంలో నడిపించడంలో ధార్మిక కార్యక్రమాలు కీలకపాత్ర పోషిస్తాయని, మన సంస్కృతికి, ఆధ్యాత్మిక చైతన్యానికి చవితి వేడుకలు ప్రతీకగా నిలుస్తాయని వివరించారు