నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత…|

0
0

భారత్ అవాజ్ న్యూస్: 31 జూలై వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం బిఆర్ఎస్ సీనియర్ నేత, నర్సంపేట మాజీఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి (52) గురువారం అర్ధరాత్రి12:51 ని” కన్నుమూశారు. ఆయనకు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. ఈనెల 26న హనుమకొండ హంటర్ రోడ్డులోని తన నివాసంలో ఆయన కార్డియాక్ అరెస్ట్ కు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే హనుమకొండలోని రోహిణి ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు అత్యవసర మైన వైద్యచికిత్సలు అందించారు. దాదాపు గంటపాటు సీపీఆర్ చేశాక ఆయన స్పందించారు. గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే నాళాల్లో బ్లాక్ లు ఏర్పడినట్టు స్థానిక డాక్టర్లు గుర్తించారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే గ్రీన్ చానెల్ ద్వారా ప్రత్యేక అంబులెన్స్ ఏర్పాటుచేసి సికింద్రాబాద్ లోని యశోద ఆస్పత్రికి తరలించారు. అక్కడే ఎక్మో(ఎక్స్ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్) విధానంలో నిపుణులైన వైద్యుల సహాయంతో అత్యాధునిక వైద్యచికిత్సలు అందించారు. కాగా, పెద్ది సుదర్శన్రెడ్డికి మెరుగైన ట్రీట్ మెంట్ అందించాలని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా యశోద ఆస్పత్రికి వెళ్లి వైద్యులను చేతులెత్తి వేడుకున్నారు. కార్డియాక్ అరెస్ట్ కు గురైన పెద్ది సుదర్శన్ రెడ్డికి యశోద ఆస్పత్రిలో అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు కేటీఆర్, టి.హరీశ్ రావు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. అయినా డాక్టర్ల కృషి ఫలించలేదు. చివరికి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తుదిశ్వాస విడిచారు.. దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము