భారత్ అవాజ్ న్యూస్: 5 జూలై రోజున వరంగల్ జిల్లా ఎంజీఎం దవాఖానలో వర్షాకాలంప్రారంభమైన తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీజనల్ వ్యాధులు పెరుగుతున్నాయి. జూన్లో ఒక్క డెంగీ కేసు నమోదవగా, జులైలో 15కు చేరింది. జ్వరాల కేసులు 551 నుంచి 597కు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు 89 నుంచి 172కు పెరిగాయి. యూపీహెచ్సీలు, పీహెచ్సీల్లో డెంగీ కేసులు నమోదవుతుండటంతో ఆరోగ్య శాఖ ఫాగింగ్, యాంటీ లార్వా పిచికారీ, జ్వర సర్వేలు ముమ్మరం చేసింది. ప్రజలు నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని కోరుతున్నారు.. దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము










