ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్):కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల పథకం రెండో విడత గృహ నిర్మాణ పనులు, లబ్ధిదారుల డెస్క్ మరియు క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియలను అత్యంత వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కె. హరిత గారు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ భవనం నుండి అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్ గారితో కలిసి జిల్లాలోని ఎంపీడీవోలు, సంబంధిత అధికారులతో ఆమె ఒక వీడియో కాన్ఫరెన్స్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని వివిధ మండలాల్లో పెండింగ్లో ఉన్న దరఖాస్తులన్నింటినీ నిర్ణీత గడువులోగా డెస్క్ పరిశీలన పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా అర్హులైన హట్ డ్వెల్లర్ల (గుడిసెలలో నివసించే వారి) వివరాలను వెంటనే ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేయాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం ఆర్సీసీ (RCC) లెవెల్లో ఉన్న 2,712 ఇండ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని, అలాగే రూఫ్ రీప్లేస్మెంట్ (పైకప్పుల మార్పిడి) పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపుల విషయంలో ఎలాంటి అపోహలు అవసరం లేదని, ప్రభుత్వం నుండి నిధులు సకాలంలో విడుదలవుతాయని వారికి అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ప్రాజెక్టు అధికారి ప్రకాష్రావు, డీఈ వేణుగోపాల్తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.










