శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలో దాడుల కలకలం|

0
3

శ్రీరాంపూర్, ఆగస్టు 10:శ్రీరాంపూర్‌లోని ప్రగతి స్టేడియం నిన్న రాత్రి ఉద్రిక్తతకు వేదికగా మారింది. యువకులపై రాడ్లు, కర్రలతో దాడి జరిగిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఘటనలో పలువురు యువకులు గాయపడినట్లు సమాచారం,బాధితుల వర్గాల వివరాల ప్రకారం.. కొందరు వ్యక్తులు గుంపుగా వచ్చి యువకులపై దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో మహిళలతో కళ్లలో కారం కొట్టించి, అనంతరం దాడి చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి,ఈ ఘటనలో భరత్ అనే వ్యక్తి పేరు స్థానికంగా వినిపిస్తుండటంతో పోలీసులు దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాల్సిన అవసరం ఏర్పడింది. సిటీ ప్యాలెస్ పరిసర ప్రాంతాల్లో స్థానిక యువతకు సంబంధించిన ఘర్షణలు, వివాదాలపై కూడా పోలీసులు నిఘా పెంచాలని ప్రజలు కోరుతున్నారు.

క్రీడా మైదానమా.. ఘర్షణల అడ్డానా?

క్రీడాకారులు, యువత కోసం ఉపయోగించాల్సిన ప్రగతి స్టేడియంలోనే ఇలాంటి దాడి జరగడం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో పోలీసుల పెట్రోలింగ్ పెంచి, ప్రజలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

దాడికి అసలు కారణం ఏమిటి? ఘటన వెనుక ఉన్నవారెవరు? భరత్ పాత్ర ఏమిటి? సిటీ ప్యాలెస్ పరిసరాల్లో జరుగుతున్న కార్యకలాపాలపై పోలీసుల చర్యలు ఏమిటి? అన్న ప్రశ్నలకు పోలీసుల దర్యాప్తులో సమాధానం రావాల్సి ఉంది.