అటవీ ఏనుగుల గుంపును మన్యం జిల్లా గుచ్చిమి వద్ద ఏర్పాటు చేసిన ఎలిఫ్యాంట్ జోన్కు తరలించేందుకు డిప్యూటీ సీఎం పవన్ 2 కుంకి ఏనుగులను పంపించారు. ఆపరేషన్ గజ పేరుతో ఏనుగుల గుంపును తరలించేందుకు అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. కుంకి ఏనుగులను చూసి అటవీ ఏనుగులు పారిపోవడంతో ఆపరేషన్ గజ మధ్యలోనే ఆగిపోయినట్లు తెలుస్తుంది. సీతానగరం మండలంలో అటవీ ఏనుగులు ఉండగా బొబ్బిలి మండలం శివడవలసలో కుంకి ఏనుగులు ఉన్నాయి.
#RAJESH










