రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిల్ల చేష్టలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని వైద్య ఆరోగ్య శాఖామంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు.బొబ్బిలి కోటలో గురువారం ఆయన మాట్లాడారు.2019లో టీడీపీకి 23 సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా రాదన్న జగన్.. వైసీపీకి 2024లో 11 సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందని ప్రశ్నించారు. మెడికల్ కళాశాల ఉద్యోగ భర్తీల్లో అక్రమాలు జరిగాయని చెప్పారు.
#RAJESH










