మంచిర్యాల: 8వ డివిజన్ కార్పొరేషన్ పరిధిలోని అరుణక్క నగర్లో విద్యుత్ సరఫరా తక్కువగా ఉండటంతో స్థానిక ప్రజలు కొంతకాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యుత్ లో-వోల్టేజ్ సమస్యతో ఇళ్లలో విద్యుత్ పరికరాలు సరిగా పనిచేయకపోవడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు,ఈ సమస్యను స్థానిక యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమిని రాజేష్ స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు దృష్టికి తీసుకెళ్లారు. అరుణక్క నగర్ ప్రజల ఇబ్బందులను వివరించి, విద్యుత్ సరఫరా మెరుగుపడేలా 100 KVA సామర్థ్యం గల కొత్త ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేను కోరారు,ప్రజల సమస్యపై స్పందించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి, అరుణక్క నగర్లో 100 KVA కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయించారు.
దీంతో విద్యుత్ సరఫరా మెరుగుపడుతుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు,తమ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేసిన భీమిని రాజేష్కు, సమస్యపై స్పందించి కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుకు అరుణక్క నగర్ స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని భీమిని రాజేష్ తెలిపారు.










