● మోదీ పిలుపుతో భారీగా సాగిన తిరంగా యాత్ర
● యాత్రలో పాల్గొన్న మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్
● ఆగస్టు 15న ప్రతి ఇంటిపై తిరంగా ఎగురవేయాలని పిలుపు.
మేడ్చల్-మల్కాజిగిరి, ఆగస్టు 13: ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు అల్వాల్ సర్కిల్ పరిధిలో గురువారం బీజేపీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా యాత్రను ఘనంగా నిర్వహించారు.
మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ కార్యక్రమంలో పాల్గొని జాతీయ పతాకాన్ని చేతబూని ర్యాలీలో నడిచారు.
అల్వాల్ మీ సేవ కూడలి నుంచి ఐజీ సర్కిల్ వరకు సాగిన ప్రదర్శనలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, సీనియర్ సిటిజన్లు, యువత, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ జెండాలను చేతబట్టి దేశభక్తి నినాదాలతో ముందుకు సాగిన యాత్ర ఉత్సాహభరిత వాతావరణాన్ని తలపించింది.
80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ప్రతి ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని నాయకులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
అన్ని వర్గాల ప్రజలు, యువత, విద్యార్థులను జాతీయ భావంతో ఏకం చేయడం, దేశభక్తి స్ఫూర్తిని పెంపొందించడమే హర్ ఘర్ తిరంగా కార్యక్రమాల ఉద్దేశమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా, నియోజకవర్గ స్థాయి నాయకులు పరాంకుశం మాధవ్, చింతల మాణిక్యరెడ్డి, శ్రీనివాస్ వర్మ, అజయ్రెడ్డి, కార్తీక్ గౌడ్, శ్రీధర్రెడ్డి, తూప్రాన్ లక్ష్మణ్, బాబీ అధికారి, భోగా విష్ణుమూర్తి, రాజిరెడ్డి, మురళి, రామ్మోహన్ గౌడ్, మోయి సుజాత, కరుణ శ్రీ, పద్మిని, దేవి, ఉష తదితరులు పాల్గొన్నారు.
#sidhumaroju
#Alwal










